5 ఓవర్లు పూర్తయినా ఒక్క వికెట్టూ పడలేదు!

  • టీ20 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ పాక్
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 రన్స్
  • లక్ష్యఛేదనలో నిలకడగా పాక్
  • 5 ఓవర్లలో 35/0
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో నేడు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. దుబాయ్ ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. లక్ష్యఛేదనను పాక్ ఆశాజనకంగా ప్రారంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్టు కూడా నష్టపోకుండా 35 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బాబర్ అజామ్ 14 పరుగులతో, మహ్మద్ రిజ్వాన్ 21 పరుగులతో ఆడుతున్నారు. స్టేడియంలో తమ జట్లను ఉత్సాహపరుస్తూ భారత్, పాక్ అభిమానులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

Pakistan
Team India
Chasing
Super-12
T20 World Cup

More Telugu News